
యంత్రాంగం అంతకంటే ఏం చేస్తుంది. ఇక్కడ మీడియా ఎవరన్నది సమస్యకానేకాదు. ఎబిఎన్, టివి 9... లేక వి6, టి ఛానలా అన్నది ప్రశ్నకాదు? వ్యతిరేక వార్తలు వ్రాస్తే కేసులు పెట్టడం, నచ్చని విషయాలను ప్రస్థావిస్తే మీడియాలను నిషేధించటం వంటి చర్యలు ప్రజాస్వామ్యవ్యవస్థలో ఎవరికీ మంచిదికాదు. ప్రజాస్వామిక హక్కుల గురించి గొంతెత్తి కూసిన విప్లవకమ్యూనిస్టులు కానీ, వామపక్ష, విప్లవభావజాలం కలిగిన తెలంగాణ ఉద్యమకారులు కానీ సుమారు మూడు నెలల నిషేధంపైన ఏ మాత్రం గొంతెత్తకపోవటం... భయమా? లేక ప్రభుత్వ చర్యలను వారు కూడా సమర్థిస్తున్నారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షను వెల్లడించటానికి జరిగిన ఉద్యమం ఎన్నో సార్లు దుందుడుకు స్వభావాన్ని సంతరించుకుంది. తమ ఆకాంక్షలను బంద్ ల రూపంలో, వివధ నిరసన ప్రదర్శనల ద్వారా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేయటం ప్రజాస్వామికమని నమ్మిన నాటి గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు రూపం మార్చాడు. అదే ప్రజాస్వామిక పద్ధతిలో నిరసన తెలుపుతున్న మహిళా పాత్రికేయులును అరెస్టు చేయటం ఒక ఎత్తైతే... పోలీసులు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకోవటానికి అత్యంత కిరాతకంగా వ్యవహరించిన తీరు నేటి ఖాకీ స్వభావాన్ని మరో మారు బట్టబయలు చేసింది. విశ్వనగరంగా హైదరాబాదును మార్చాలనుకుంటున్న వారెవ్వరైనా తెలుసుకోవాల్సిన మరో విషయం... కేవలం భవనాలు, రహదారులు మాత్రమే విశ్వనగరానికి ప్రతీకలు కాబోవు. పరిఢవిల్లే ప్రజాస్వామ్యం, ఉచ్ఛనాగరికతలు మాత్రమే విశ్వనగరంగా హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయి. పోలీసు యంత్రాగాన్ని ఆధునీకరించటమంటే అధునాతన వాహనాలు, ఆయుధాలు సమకూర్చటం ఒక్కటే కాదు... మానవీయకోణాన్ని అద్దటం కూడా...
మరో విషాదాన్ని ఈ సందర్భంగా మాట్లాడేతీరాలి. ఇలాంటి వ్యవహరాలపై అటు పౌరసమాజంకానీ, ఇటు మీడియా ప్రపంచం కానీ స్పందించకపోవటం... ఇది కేవలం ఆ రెండు ఛానళ్ళ స్వంతవ్యవహారంగా చూడటం... నిజంగా దురదృష్టకరమే. ఎవరికి నచ్చని మీడియాను వారు నిషేధించుకుంటూ పోతే చివరికి ప్రజాస్వామ్యవ్యవస్థలో మూల స్థంభాలలో ఒకటిగా చెప్పుకునే మీడియా పూర్తిగా చచ్చిపోతుంది. నిరసన తెలుపుతున్న పాత్రికేయుల అరెస్టును ఖండించటానికి కూడా తెలంగాణ పాత్రికేయ ప్రపంచం సాహసించలేకపోవటం... నేడున్న పరిస్థితులలో నా రాతలు ఓ ఆంధ్రా పాత్రికేయుడి రాతలుగా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలోని పాత్రికేయులు చూస్తారన్న అనుభవానుమానం వెంటాడుతున్నా... నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఈ నిరసనలు జరుగుతున్న సమయంలోనే ప్రజలకోసం, ప్రజాస్వామిక విలువలకోసం కడవరకూ సాహితీసమరం చేసిన కాళోజీ శతజయంతోత్సవాలకు వరంగల్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చారు. ఆయన ఎదుట తమ నిరసన తెలుపుతున్న పాత్రికేయులపై పోలీసులు లాఠీఛార్జి, అరెస్టు

మేరకు విశాఖలో జరిగిన ప్రదర్శనలో దాదాపుగా అన్ని ఛానల్స్ కు చెందిన పాత్రికేయులు పాల్గొని మద్దతుగా నిలవటం మంచిపరిణామం. ఈ స్పిరిట్ తెలంగాణలో లేకపోవటం తప్పు పాత్రికేయులదా? యాజమాన్యాలదా? చర్చజరగాల్సిందే...